యాపిల్ ‘ఐఫోన్’ ప్రేమికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. కస్టమ్స్ రూల్స్ 2026లో చేసిన తాజా మార్పులతో ఇప్పుడు అమెరికా నుంచి ఐఫోన్ 17 (iPhone 17)ను భారత్కు తీసుకురావడం మరింత సులభంగా మారింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనలు పెద్ద ఊరట కలిగించనున్నాయి.
కొత్త కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు డ్యూటీ ఫ్రీగా తీసుకురాగలిగే వస్తువుల విలువను రూ.75,000 వరకు పెంచారు. గతంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అనే చెప్పాలి. అమెరికాలో తక్కువ ధరకు లభించే ఐఫోన్లను కొనుగోలు చేసి.. భారత్కు తీసుకురావడం ఇప్పుడు లాభదాయకంగా మారింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ల్యాప్టాప్ను డ్యూటీ ఫ్రీగా భారత్కు తీసుకురావడానికి అనుమతి ఉంది. దాంతో స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్తో పాటు తరచుగా విదేశాలకు ప్రయాణించే వారికి భారీ ప్రయోజనం కలగనుంది.
Also Read:
ఇంతకుముందు భారత్కు ఖరీదైన గాడ్జెట్లు తీసుకొస్తే.. అదనపు కస్టమ్స్ డ్యూటీ విధించే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ తాజా నిబంధనలతో హైఎండ్ స్మార్ట్ఫోన్లు, ప్రీమియం గాడ్జెట్లపై అదనపు కస్టమ్స్ వసూలు చేసే అవకాశం గణనీయంగా తగ్గింది. దీంతో ఐఫోన్ 17 లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్లను సులభంగా తీసుకురావచ్చు. అమెరికాలో ఐఫోన్ ధరలు భారత్తో పోలిస్తే తక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కస్టమ్స్ నిబంధనల సడలింపుతో తాజా మోడల్ ఐఫోన్ 17 కొనుగోలు మరింత చౌకగా, టెన్షన్ లేకుండా తీసుకురావడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, విదేశాల నుంచి వచ్చే బంధువుల ద్వారా ఐఫోన్ తెప్పించుకునేవారికి ఇది నిజంగా డబుల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు.
