Chat GPT & Deep Seek:ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్పై కేంద్రం సంచలన ఆదేశాలు
- Chat GPT, Deep Seek వంటి యాప్ లు ఉపయోగించొద్దన్న కేంద్రం
- డేటా గోప్యత, సమాచార భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో Chat GPT, Deep Seek వంటి ప్రజాదరణ పొందిన AI టూల్స్ను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయమై ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది. ప్రభుత్వానికి చెందిన అధికారిక పరికరాలు, సిస్టమ్స్పై ఈ AI టూల్స్ వినియోగాన్ని పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది.
ఈ నిర్ణయం ప్రధానంగా ప్రభుత్వ డేటా గోప్యత (డేటా ప్రైవసీ), సమాచార భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నియంత్రణలేమి లేకుండా AI టూల్స్లో సున్నితమైన, వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని నమోదు చేయడం వల్ల ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశానికి సంబంధించిన రహస్య సమాచారం ఇతర దేశాలకు లేదా అనధికార సంస్థలకు చేరే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
Also Read
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
ప్రభుత్వ శాఖలు మరియు ఉద్యోగులు అధికారిక విధులు నిర్వహించేటప్పుడు AI సేవలను అత్యంత జాగ్రత్తగా, నియమావళి ప్రకారం మరియు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉపయోగించాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ సమాచారాన్ని మరింత సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కూడా కేంద్రం గుర్తు చేసింది.
ఇదే సమయంలో సైబర్ నిపుణులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ సమాచారం వంటి సున్నితమైన డేటాను AI టూల్స్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్లోడ్ చేయకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా డేటా దుర్వినియోగం, సైబర్ ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?