Today (21-02-23) Stock Market Roundup: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇవాళ మంగవాళం ఎక్కువ శాతం ట్రేడిండ్ ఊగిసలాట ధోరణిలో నడిచింది. రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 18 వేల బెంచ్ మార్క్కి దిగువన క్లోజ్ అయింది. ఇంట్రాడేలో టాటా స్టీల్ మరియు రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటంతో సెన్సెక్స్, నిఫ్టీ కాస్త కోలుకున్నాయి.