ఆరుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై దాఖలు చేసిన చార్జిషీట్లో ఆయన విచారణను ఎదుర్కోవచ్చని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం నాడు తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని అన్నారు.
దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనల కారణంగా గత నాలుగు నెలలుగా క్రీడలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. తనను ఉరితీసినా సిద్ధంగా ఉన్నానని.. అయితే జాతీయ ఛాంపియన్షిప్లు, క్యాంపులతో సహా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోకూడదని, ఇది క్యాడెట్, జూనియర్ రెజ్లర్లకు హానికరమని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పేర్కొన్నారు.
మహిళా రెజర్లు తనపై చేసిన ఆరోపణలపై జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనలో శక్తి ఉన్నంతవరకు పోరాడతానంటూ ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.