Legends League Cricket: మాజీ స్టార్ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 15న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నట్లు లెజెండ్ లీగ్ క్రికెట్ శుక్రవారం వెల్లడించింది. భారత్ స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక మ్యాచ్ జరుగబోతోంది. ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచులో మొత్తం 10 దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు…