Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ జరపనుంది. గత విచారణ సందర్భంగా ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని కోర్టు స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.