ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరు నెలలుగా జీతాలు లేక ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా మాధవరావుపల్లి కి చెందిన మైదం మహేష్(34).. ములుగు గ్రామ పంచాయతీలో ఔట్సోర్సింగ్ డైలీ లేబర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా జీతం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో ఏం చేయాలో తోచక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మహేష్..