2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్కు హర్ష దూరం కానున్నాడు.