కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారు కాంతులతో మెరిసిపోయే శ్రీవారి గర్భాలయ గోపురం. దీనినే ‘ఆనంద నిలయం’ అని పిలుస్తారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? అక్కడ అడుగుపెట్టగానే భక్తులు ఎందుకు తన్మయత్వానికి లోనవుతారో తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే ఏ పూజలోనైనా, క్షేత్ర దర్శనంలోనైనా మన త్రికరణములు (మనస్సు, వాక్కు, కర్మ) ఒకేచోట లగ్నం కావు. గుడిలో ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది, మాటల్లో…