US warns Indian students: భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం, భారత విద్యార్థులకు హెచ్చరిక చేసింది. అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే డిపోర్ట్ చేస్తామని చెప్పింది. అమెరికా వీసా ‘‘ప్రత్యేక హక్కు కాదు’’ అని యూఎస్ మిషన్ స్పష్టంగా చెబుతోంది. అమెరికాలో ఉన్న సమయంలో చట్టాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని పేర్కొంది.
ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాలు ప్రధానంగా ఇండియా, చైనా, గల్ఫ్ దేశాల బిలియనీర్లను లక్ష్యంగా చేసుకుంటాయనే విశ్లేషణలున్నాయి. అమెరికా మోజున్నవారు కాస్త ఎక్కువ ఖర్చు చేసైనా వీసాలు కొనే ప్రయత్నం చేస్తారని ట్రంప్ అంచనా వేస్తున్నారు.