Stock Market Roundup 24-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం మొత్తం నష్టాలనే చవిచూసింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం నష్టాలతోనే ముగిసింది. మధ్యాహ్నం జరిగిన లావాదేవీల వల్ల రెండు కీలక సూచీలు కూడా లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీసీ మరియు లార్సన్ అండ్ టూబ్రో వంటి సంస్థల షేర్ల విలువ పడిపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.