ప్రపంచ దేశాలను యుద్ధ సంక్షోభం వెంటాడుతున్న వేళ అన్ని ధరలు పెరుగుతున్న సమయంలో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో కొనుగోలుదారులకు ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఈరోజు తులం గోల్డ్ ధరపై రూ.980 తగ్గగా.. కిలో వెండిపై రూ.100 తగ్గింది.
హమ్మయ్య.. యుద్ధం వేళ మగువలకు గుడ్న్యూస్ అందింది. గురువారం బంగారం ధరలు దిగొచ్చాయి. చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా పెరిగిపోవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా దిగొస్తున్నాయి.