హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 2న అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే హనుమాన్ జయంతి,, ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. ఈ శోభాయాత్ర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయ యాత్ర సుమారు 12.5 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రధానంగా కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి…