సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు.…