తమిళనాడులోని ఆవడి ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF)లో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ వెపన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మైలాడుతురై జిల్లా ముట్టపుదుపేట్కు చెందిన కాళిదాస్ (55)గా గుర్తించారు. అతనికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.
పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఊహించని దారుణానికి తెగబడ్డాడు. ఏఎస్సై హోదాలోని అధికారి తన సర్వీస్ రివాల్వర్తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను కాల్చి చంపాడు. అమృత్సర్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్తో అతని భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్ప్రీత్ సింగ్ (19)లను హత్య చేశాడు.