Union Budget 2026: ప్రస్తుతం కాలంలో టెక్నాలజీకి ఎంతో అవసరమైన సెమీ కండక్టర్లు, రేర్ ఎర్త్ ఖనిజాలకు కేంద్ర బడ్జెట్ 2026 పెద్ద పీట వేసింది. సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు భారత్ సెమీ-కండక్టర్ మిషన్ 2.0ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు.