అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి10 గంటలకుప్రసారం చేయనుంది. ఆసక్తికరమైనమలుపులు, అదిరిపోయే ట్విస్ట్స్ తో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరోఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.‘సరిగమప పార్టీకి వేళాయెరా’…