ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ప్లాన్ తెలుసుకుని పోలీసులే షాక్కు గురయ్యారు. ఇక అంతకంటే ముందే సుప్రీంకోర్టు దగ్గరే భారీ దాడికి ప్లాన్ చేశాడు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో మరొక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తహసీన్ సయ్యద్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లో అదుపులోకి తీసుకున్నారు. తహసీన్ సయ్యద్.. ప్రధాన నిందితుడు సకారియా రాజేష్భాయ్ ఖిమ్జీ(41) స్నేహితుడిగా గుర్తించారు.