IPL Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తుది దశకు చేరుకుంది. మంగళవారం, ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఫైనల్పై రాజకీయం మొదలైంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కోల్కతా నుంచి గుజరాత్కి మార్చాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం ఆదివారం విమర్శించింది.