RSS: ప్రధాని నరేంద్ర మోడీ రేపు (అక్టోబర్ 1) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రతిబింబించే స్మారక తపాలా బిళ్ళ మరియు నాణేలు విడుదల చేయనున్నారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.