Rameswaram 22 Sacred Wells Story: భారతదేశం...! అనాది కాలం నుంచి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. ప్రతి అడుగులో దేవాలయాల ఘంటానాదం వినిపించే దేశం. ప్రతి నదీ ప్రవాహంలో దైవత్వం ప్రతిధ్వనించే దేశం. యుగయుగాలుగా ఋషులు, మునులు తపస్సు చేసిన నేల ఇది. దేవతలు సంచరించిన తీర్థక్షేత్రాల సమాహారం ఇది. అలాంటి అనేక పవిత్రక్షేత్రాలు ఉన్న భారతంలో తమిళనాడులోని రామేశ్వరం ప్రత్యేకంగా నిలుస్తోంది. అత్యంత పవిత్ర తీర్థక్షేత్రాల్లో ఒకటిగా భక్తుల హృదయాల్లో వెలుగొందుతోంది.