రామ్ చరణ్ తేజ హీరోగా, బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా, ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, అది రిలీజ్ కాకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా, స్వల్ప గాయానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. సినిమాలో కీలకమైన…