Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన ఘటనలో రోజుకో ప్రాణం గాల్లో కలుస్తోంది. తాజాగాఈ ఘటనలో మరో మహిళ మృతి చెందారు. లాలాచెరువు ప్రాంతానికి చెందిన జి. వెంకటలక్ష్మి (69) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 9కు చేరింది.