భారత ఆటగాడు పృథ్వీ షాను ముంబై రంజీ టీమ్ నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్ తప్పించిన విషయం తెలిసిందే. ఫామ్, ఫిట్నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన పృథ్వీకి.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లోనూ చోటు లేకపోవడంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ అతడికి అండగా నిలిచాడు. అథ్లెట్ల కెరీర్లో ఒడిదొడుకులు సహజమేనని, వాటికి ఎదురొడ్డి పోరాడాలని సూచన…
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు.. తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబై రంజీ టీమ్లోకి పృథ్వీ షాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో అఖిల్ హెర్వాడ్కర్ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. పృథ్వీ షా పక్కనపెట్టడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు కానీ.. ఫామ్, ఫిట్నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వేటు వేసినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ఫామ్…