Pratyusha Death Case: సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష మరణం కేసులో ఆమె తల్లి సరోజిని తాజాగా వెల్లడించిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి. తన బిడ్డ మరణానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో తన బిడ్డ చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని సరోజిని వాపోయారు. “దాదాపు రెండు గంటల పాటు నన్ను ఐసీయూ (ICU) బయటే పిచ్చిదానిలా నిలబెట్టారు. లోపల చికిత్స జరుగుతోంది, మీరు వెళ్ళకూడదు…