విలేజ్ డ్రామాగా రాబోతోన్న ‘ప్రణయగోదారి’ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రాన్ని పిఎల్వి క్రియేషన్స్పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను మేకర్లు ప్రకటించారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్లు అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సినిమాలోని ప్రధాన పాత్రలను చూపించారు. ఇందులో సాయి కుమార్ అత్యంత కీలకమైన…