పోలియో చుక్కల పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి రోజు ఐదుసంవత్సరాల్లోపు చిన్నారులందరికీ ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, పంచాయతీ కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక సెంటర్లను నెలకొల్పారు. పోలియో సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…
కరోనా వల్ల పల్స్ పోలియో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని.. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో మళ్లీ పోలియో చుక్కలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. వచ్చే మూడు రోజులు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్రావు.. పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 వేల సెంటర్లలో పోలియో కార్యక్రమం చేపట్టామని.. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయాలని సూచించారు.. ఈ సారి 28 లక్షల మంది…