పాకిస్తాన్ క్రికెట్ మరోసారి కుదుపులకు గురైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ముదిరిపోవడంతో, స్టార్ బ్యాట్స్మన్పై నిషేధం విధించింది. ఆ బ్యాట్స్మన్ పేరు ఫఖర్ జమాన్. పీఎస్ఎల్లో ఫఖర్పై రెండు మ్యాచ్ల నిషేధం విధించారు. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు రుజువైంది. ఈ నిషేధాన్ని ప్రకటిస్తూ పీసీబీ ఒక ప్రకటన జారీ చేసింది. Also Read:Rajasekhar: యూవీ క్రియేషన్స్ అంటే రాయల్…