బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్ హసీనా సహా 96 మంది పాస్పోర్టులను పాస్పోర్ట్, ఇమ్మిగ్రేషన్ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు,…
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్టులను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్పోర్టును కేంద్రం సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ సస్పెండ్ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు.
తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఐడి కేసు నమోదు అయింది. నకిలీ వీసా, పాస్ పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను సీఐడి అధికారులు పట్టుకున్నారు. కాగా.. ఐదు జిల్లాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సీఐడి అధికారుల దాడులు చేపట్టిన ప్రదేశాల్లో.. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేపట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు.. విదేశీయులకు పాస్పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తుంది ముఠా.
2023లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టు కలిగిన దేశంగా జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాస్పోర్టుతో వీసా లేకుండానే 193 ప్రపంచ దేశాల్లో ప్రయాణించవచ్చు. తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. జపాన్ దేశం వరుసగా ఐదో సంవత్సరం అగ్రస్థానంలో ఉంది.