భారత్తో మ్యాచ్లో కీలక సందర్భాల్లో తమ ప్రణాళికలు పని చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ చెప్పాడు. కీలక పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. గత ఆరు నెలలుగా తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే వారిపైనే నమ్మకం ఉంచామని.. అయితే భారత్తో మ్యాచ్లో వారికి కలిసి రాలేదని వివరించాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం…