ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో అనేక మంది మరణించినట్లు సమాచారం. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం…