గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.
ఎండలు దంచికొడుతున్నాయి.. ఏళ్ల క్రితం నమోదైన రికార్డులను భానుడి భగభగలు బ్రేక్ చేస్తున్నాయి.. ఏప్రిల్ నెలే.. మే, జూన్ మాసాలుగా మారిపోయి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఐఎండీ.. ఇక, 122 ఏళ్లలో నార్త్ ఇండియాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి లేదు.. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, వాయవ్య, మధ్య భారతంలో రికార్డ్స్థాయిలో…