పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉండనుంది. కాగా.. ఎల్లుండి (సోమవారం) పోలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఉ.8 గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగనుంది. అందుకోసం 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా.. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.