CM Chandrababu: ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా.. ఆల్ రౌండర్లుగా నిలిచారని అన్నారు. విజయవాడలోని ఆంత్రా లక్స్ కన్వెన్షన్లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. Gas Cylinder Priced…