Bengal hostage row: పశ్చిమ బెంగాల్ మాల్దాలో ఏడుగురు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) అధికారుల్ని నిర్బంధించడంపై సుప్రీంకోర్టు మమతా బెనర్జీ సర్కార్పై సీనియస్ అయ్యింది. ఈ ఘటన గురువారం ఉదయం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని "నేరపూరిత వైఫల్యం"గా అభివర్ణిస్తూ విమర్శించింది.
Story Board: ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నా.. అందరి దృష్టీ బెంగాల్ ఎన్నికల మీదే కేంద్రీకృతమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని బలంగా ఢీకొడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచినా.. మమతను ఓడించి.. బీజేపీ సంచలనం సృష్టించింది. ఈసారి ఇంకాస్త కష్టపడితే దీదీని గద్దె దింపటం పెద్ద కష్టం కాదని కాషాయ పార్టీ తలపోస్తోంది.…