శివసేన పార్టీ తమదేనని నిరూపించుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శివసేన తమదేనని బలమైన వాదన వినిపించడానికి ఇరు వర్గాలు ఈసీకి పత్రాలు సమర్పించాయి. ఈ పోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎవరిదో తేల్చేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.