Supreme Court: ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పాలన, బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ‘‘రెచ్చగొట్టే’’ కార్టూన్ను వేసిన కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్టూన్ను శివుడి వ్యాఖ్యలతో లింక్ చేయడాన్ని తప్పుపట్టింది. ఇండోర్కు చెందిన 50 ఏళ్ల కార్టూనిస్ట్ ‘‘అపరిపక్వత’’ పట్ల జస్టిస్ సుధాన్షు ధులియా నేతృత్వంలోని ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతను వాక్, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని పేర్కొంది. కార్టూన్ను తొలగించాలని కోర్టు కోరింది.