ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మనసులో పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. ప్రేమించినవారు దక్కకపోతే తమను తాము అంతం చేసుకుంటున్నారు.. లేదు అంటే ప్రేమించినవారిని అంతం చేస్తున్నారు. తాజాగా ప్రేమించిన ప్రియురాలు తనను కాదని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. అంతేకాకుండా ఆమెను చంపి పోలీసులు వచ్చేవరకు ఆమెను హత్తుకొని ఉండిపోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.…
కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.