CM Revanth Reddy: ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూత నివ్వాలని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం క్రీడాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సూచించారు. గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంను పునరుద్ధరించడం తోపాటు, స్టేడియం ఆవరణలో…