ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. తాజాగా గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 22 మంది మరణించారు. గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 22 మంది పాలస్తీనియన్లు మరణించారు. 30 మంది గాయపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.