అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుడిగాలుల తరహాలో విరుచుకుపడే టోర్నడోల కారణంగా కెంటకీ అనే ప్రాంతంలో ఇప్పటికే 100మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషిర్ వెల్లడించారు. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత బీభత్సమైన టోర్నడో అని గవర్నర్ తెలిపారు. ఒక్క మేఫీల్డ్ నగరంలోనే కొవ్వత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. Read Also: పాముతో పరాచకాలాడితే ఇలాగే…