Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ చొరబాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు? గత రెండు రోజుల్లో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సల్మాన్ ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. వారిద్దరూ భవనంలోకి ప్రవేశించి సల్మాన్ ప్లాట్కు చేరుకున్నారు. అయితే, పోలీసులు సకాలంలో ఇద్దరినీ అరెస్టు చేశారు. సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ప్రవేశించారు. వారిని…