New Survey: మనదేశంలో ప్రజలు ఎక్కువగా వైద్యులు, ఉపాధ్యాయులు, ఆర్మీని ఎక్కువగా నమ్ముతున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సంస్థ అయిన ఇప్సోస్ ఈ సర్వే చేసింది. 32 దేశాల్లో ఈ సర్వేని నిర్వహించింది. అయితే, మనదేశం విషయానికి వస్తే దేశంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ మంత్రులు, మత పూజారులను తక్కువగా నమ్ముతున్నట్లు తేలింది.