మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, భారత్కు చెందిన మరో నౌక గ్రీన్ ఆశా (Green Asha) సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. ఈ నౌక ఎల్పీజీ (వంట గ్యాస్) తీసుకెళ్తున్న ట్యాంకర్గా సమాచారం. ఈ సంఘటనతో, యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ మార్గాన్ని దాటిన భారత నౌకల సంఖ్య తొమ్మిదికి చేరింది. హోర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు మార్గాల్లో ఒకటి. అయితే ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ మార్గంపై…