దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలకు ప్రజలు సిద్ధపడుతున్నారు. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, చలిగాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
IMD Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో పయనించి, నేటి అర్థరాత్రి తర్వాత వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.…