Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు.
ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలంటే యుద్ధం చేయాలి. లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి. కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు. జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు. అంతే కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తిచేస్తాయి. ఇప్పుడు ఏ దేశానికైనా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి రెగ్యులర్ సమస్యల కంటే డ్రగ్స్ భూతమే పెనుముప్పుగా దాపురించింది. డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి. పబ్బులకు వెళ్తేనే కదా ప్రాబ్లమ్ అనుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్…