లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యతతో గెలుపొందిన గత రికార్డును ఐదుగురు అభ్యర్థులు బద్దలు కొట్టారు. అందులో బీజేపీకి చెందిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. ఇండోర్ నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.