కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొని.. షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా అధికార బీఆర్ఎస్.. ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.