తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలను ఐదు రోజులపాటు టీటీడి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ నిర్వహిస్తున్న ఈ వేడుకలపై హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్వవస్థాపకులు గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో టీటీడీ హనుమత్ జయంతి వేడుకలు చేయడం అసంబద్దం అని అన్నారు. జన్మతిథి తెలియదని చెప్పిన టీటీడీ ప్రచారపుస్తకంలో మూడు జన్మతిథులను ఎలా ప్రచురించిందని అన్నారు. జన్మతిథిని తప్పుగా ప్రచురించారని, మొదట్లో హనుమంతుడు జపాలీ తీర్థంలో జన్మించారని చెప్పిన టీటీడీ ఇప్పుడు ఆకాశగంగలో పుట్టారని…