Gyanvapi mosque: భారత పురావస్తు సర్వే (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకె ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న మందిర్ - మసీద్ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రామ జన్మభూమి, మధుర, జ్ఞానవాపి మూడు స్థలాలు మాత్రమే చర్చకు కేంద్రంగా ఉండాలని కోరారు. హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలంటే ముస్లింలు ఈ ప్రాంతాలను ఇష్టపూర్వకంగా అప్పగించాలని సూచించారు.
Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వారణాసి కోర్టు. హిందూ పక్షం తరుపు మసీదులోని వాజూఖానాలో బయటపడిన శివలింగానికి శాస్త్రీయ పరిశోధన జరగాలని.. కార్బన్ డేటింగ్ జరిపించాలని కోరుతూ కోర్టును కోరారు. అయితే శుక్రవారం రోజూ హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి కోర్టు తిరస్కరించింది. హిందూ సంఘాల తరుపున వాదిస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.